నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు 'అమ్మఒడి' వర్తించదు: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
- ఈ నెల 9 నుంచి అమ్మఒడి అమలు
- చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం జగన్
- వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేశ్
అయితే, నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు అమ్మఒడి వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఆరు నెలల విద్యుత్ బిల్లుల సరాసరి పరిశీలించి అర్హులను గుర్తిస్తామని తెలిపారు. ఈసారి 75 శాతం హాజరు నిబంధన పరిగణించకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.