Cm: మాజీ మంత్రి బొజ్జలను పరామర్శించిన సీఎం కేసీఆర్

  • ఇటీవల అస్వస్థతకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
  • హైదరాబాద్ లోని బొజ్జల నివాసానికి వెళ్లిన కేసీఆర్
  • బొజ్జల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న సీఎం

సీఎం కేసీఆర్ కు మిత్రుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్నబొజ్జల     నివాసానికి కేసీఆర్ ఈరోజు వెళ్లారు. బొజ్జల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, వారి కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు. కాగా, బొజ్జల కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

More Telugu News