Sri Lanka: శ్రీలంకతో టీ20: టాస్ గెలిచిన టీమిండియా... వరుణుడు అడ్డంకి

  • గౌహతిలో మ్యాచ్
  • ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
  • గౌహతిలో వర్షం

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా గౌహతిలో తొలి మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గౌహతి పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తుందన్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛేజింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. అయితే గౌహతిలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేయనున్న నేపథ్యంలో అందరి కళ్లు అతడిపైనే ఉండనున్నాయి. యువ పేసర్ నవదీప్ సైనీ కూడా తుదిజట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

More Telugu News