Pakistan: ఇమ్రాన్‌.. మొదట నీ దేశం గురించి ఆలోచించు: అసదుద్దీన్ ఒవైసీ

  • భారత ముస్లింలుగా మేము గర్వపడుతున్నాం
  • మేము ఎప్పటికీ అలాగే ఉంటాం
  • పాక్‌లో సిక్కులకు రక్షణ కల్పించాలి

యూపీలో ముస్లింలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఓ ఫేక్ వీడియోను ట్వీట్‌ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అభాసుపాలైన విషయం తెలిసిందే. దీనిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఇమ్రాన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను భారత్‌లో జరిగినట్టుగా ఇమ్రాన్ తప్పుడు పోస్ట్‌ చేశారని ఆయన అన్నారు. ఆయన మొదట తన దేశం గురించి ఆలోచించాలని సూచించారు.

భారత ముస్లింలుగా తాము గర్వపడుతున్నామని తాము ఎప్పటికీ అలాగే ఉంటామని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పాక్‌లోని గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడిపై ఆయన స్పందిస్తూ.. సిక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏలపై ఒవైసీ స్పందిస్తూ... దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకే  వీటిని తీసుకొస్తోందని అన్నారు. ఎన్‌ఆర్‌సీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తనను చంపేందుకు కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దమ్ముంటే ముందు తనను చంపాలని వ్యాఖ్యానించారు.

More Telugu News