Hyderabad: రేపు హైదరాబాద్ లో ‘జనసేన’ విద్యార్థి గర్జన

  • ఓయూ లోని ఆర్ట్స్ కాలేజ్ లో విద్యార్థి గర్జన
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్

రేపు హైదరాబాద్ లో ‘జనసేన’ విద్యార్థి గర్జన నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్శిటీ లోని ఆర్ట్స్ కాలేజ్ లో మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘జనసేన’ ఓ ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, తెలంగాణలో మద్యపాన నిషేధం విధించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ గర్జన నిర్వహించనున్నట్లు తెలిపింది.

More Telugu News