Savitri: మరుసటి రోజు షూటింగ్ అనగా 'షావుకారు' జానకిని తప్పించారట

  • పార్వతి పాత్ర కోసం భానుమతిని అనుకున్నారు
  • సున్నితంగా తిరస్కరించిన భానుమతి
  • 'షావుకారు' జానకి ప్లేస్ లోకి సావిత్రి వచ్చారన్న ఈశ్వర్   

సావిత్రి .. భానుమతి .. 'షావుకారు' జానకి తెలుగు తెర కథానాయికలుగా తమదైన ముద్ర వేశారు. ఆ ముగ్గురికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా 'దేవదాసు' నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా భానుమతిగారిని అనుకున్నారు. ఎందుకో తెలియదుగానీ ఆమె ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు.

ఆ తరువాత పార్వతి పాత్రకి 'షావుకారు' జానకిని అనుకున్నారు. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపించాయి. అయితే మరుసటి రోజు షూటింగ్ అనగా, 'షావుకారు'జానకి ప్లేస్ లోకి సావిత్రిగారు వచ్చారు. ఏం జరిగిందో తెలియక అంతా ఆశ్చర్యపోయారు. జరిగినదేదైనా అది సావిత్రిగారిని అగ్రస్థాయి కథానాయికగా నిలబెట్టేసింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News