తిరుపతిని రాజధాని చేయాలి.. ముగ్గురు సీఎంలను పెట్టాలి: టీడీపీ నేత అమర్నాథ్రెడ్డి
- మూడు రాజధానులు ఎందుకో అర్థం కావడం లేదు
- హామీలను నెరవేర్చలేక ఇలాంటి పనులు చేస్తున్నారు
- రాయలసీమ కోసం పోరాడేందుకు సిద్ధం
ఈ నేపథ్యంలో టీడీపీ నేత అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే పక్షంలో... తిరుపతిని కూడా రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండాలని అన్నారు. పాలించడం చేతకాక, ఎన్నికల హామీలను నెరవేర్చలేకే జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారనిపిస్తోందని చెప్పారు. రాయలసీమ పరిరక్షణ కోసం పోరాడేందుకు కూడా సిద్ధమేనని అన్నారు.