West Godavari District: రేపు వైఎస్సార్ ‘ఆరోగ్యశ్రీ’ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం

  • ప.గో.లో ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్
  • ‘ఆరోగ్య శ్రీ పథకం’ కింద మొత్తం 1059 వ్యాధులకు సేవలు  
  • ఈ పథకం కింద చేరనున్న మరో 1000 వ్యాధులు 

ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్ట్ కు రేపు శ్రీకారం చుట్టనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. కాగా, ఆరోగ్య శ్రీ పథకంలో మొత్తం 1059 వ్యాధులకు సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద సేవలు అందిచేందుకు మరో 1000 వ్యాధులను చేర్చనున్నారు. కాగా, ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా ఆయా వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

More Telugu News