AP capital: ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాతే కేంద్రం పరిశీలిస్తుంది
  • మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం చేయాలి  
  • తెలంగాణ ‘మున్సి’ పోల్స్ లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ  

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ అంశం కేంద్రం పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం, ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపిన తర్వాతే కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుతామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

More Telugu News