Amaravati: రాజధాని అమరావతిపై రేపు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక

  • అమరావతిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక సిద్ధం
  • తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసుకి వెళ్లనున్న బీసీజీ  
  • సీఎం జగన్ కు నివేదిక అందజేయనున్న ప్రతినిధులు

రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఈ నెల 8న కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది.

More Telugu News