jp: రానున్న రోజుల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ముంచుకురానుంది: జయప్రకాశ్ నారాయణ

  • సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు మనం ఏ మేరకు సిద్ధంగా ఉన్నాం?
  • ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారు
  • ప్రజల బతుకులు మారట్లేదు.. మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదు
  • రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోంది  

రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రానుందని, దీన్ని ఎదుర్కునేందుకు మనం ఏ మేరకు సిద్ధంగా ఉన్నాం? అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీఎం, సీఎంలు, కలెక్టర్లు తప్ప మిగతా వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోందని చెప్పారు.

ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని, వారి బతుకులు మారట్లేదని, మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదని జేపీ అన్నారు. నేర పరిశోధన, న్యాయ విచారణ వేగంగా జరగాలని కోరుకుంటూ, ప్రజలు ఎన్ కౌంటర్ వంటి సత్వర న్యాయం వైపునకు మొగ్గుచూపుతున్నారని జేపీ అన్నారు. తమ ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అవుతోందని తెలిపారు. తమ అధ్యయనాలు, పోరాటాల ఫలితంగా ఇప్పటికి దేశంలో మూడు రాజ్యాంగ సవరణలు, ఎనిమిది చట్టాలు చేశారని అన్నారు. ఇవి తాము సాధించిన విజయాలని ఆయన అన్నారు.

More Telugu News