Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 304 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 87 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం పైగా లాభపడ్డ ఎన్టీపీసీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు నష్టపోయి 41,253కు పడిపోయింది. నిఫ్టీ 87 పాయింట్లు పతనమై 12,168 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.01%), సన్ ఫార్మా (0.62%), ఓఎన్జీసీ (0.55%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.29%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.11%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.51%), బజాజ్ ఆటో (-2.16%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.95%), హీరో మోటోకార్ప్ (-1.44%),  ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.31%).

More Telugu News