Samajvadi party: ములాయంసింగ్ యాదవ్ కు అస్వస్థత

  • ములాయం సింగ్ కు పొత్తికడుపు సంబంధింత సమస్య
  • ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స
  • ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు 

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా పొత్తికడుపు సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ములాయం సింగ్ ను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో ములాయం చేరినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ములాయంను ఈరోజు డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News