Anushka: ఒక హత్య చుట్టూ తిరిగే కథతో 'నిశ్శబ్దం'!

  • సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే 'నిశ్శబ్దం'
  • ముఖ్య పాత్రల్లో అంజలి - షాలినీ పాండే 
  • జనవరి 31న ప్రేక్షకుల ముందుకు   

అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో 'నిశ్శబ్దం' రూపొందింది. చిత్రకారిణిగా ఈ సినిమాలో అనుష్క కనిపించనుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుందనే సంగతి తెలిసిందే. అయితే కథ ఏ అంశం చుట్టూ తిరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఒక హత్య చుట్టూ తిరగనుందనేది తాజా సమాచారం. ఈ హత్యకి .. అనుష్కకి సంబంధం ఏమిటనేది చాలా ఇంట్రెస్టింగ్ వుంటుందట.

హత్యకి సంబంధించిన ముడులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే తీరు ఆడియన్స్ ను కదలనివ్వదని అంటున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిగింది. అనుష్క భర్తగా మాధవన్ నటించగా, ముఖ్యమైన పాత్రల్లో అంజలి .. షాలినీ పాండే .. మైఖేల్ మాడిసన్ కనిపించనున్నారు. అనుష్క కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా ఈ సినిమా నిలిపోతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

More Telugu News