cm: అసలు, సెటిల్ మెంట్లు చేస్తున్నదే విజయసాయిరెడ్డి!: కూన రవికుమార్

  • జగన్, విజయసాయిరెడ్డి మనుషులు భూ కబ్జాలు చేస్తున్నారు
  • ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఓ స్టార్ హోటల్ కట్టాలని చూస్తున్నారు
  • జగన్ పాలనలో తమ ఆస్తుల గురించి ప్రజలు భయపడుతున్నారు

సీఎం జగన్ పాలనలో తమ ఆస్తులు ఏమవుతాయోనని విశాఖపట్టణం ప్రజలు భయపడుతున్నారని టీడీపీ నాయకుడు కూన రవికుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్, విజయసాయిరెడ్డి మనుషులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఓ స్టార్ హోటల్ కట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. సెటిల్ మెంట్లు చేస్తే కేసులు పెట్టాలంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, 'అసలు, సెటిల్ మెంట్లు చేస్తున్నదే విజయసాయిరెడ్డి' అని ఆరోపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అభివృద్ధి జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

More Telugu News