YSRCP: భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలి:ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

  • అమరావతి రైతులు రాజధాని కావాలని అడగలేదు
  • భూములు కావాలని కోరగానే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేశారు
  • రాజధాని రైతులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది

రాజధానికోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనపై మాట్లాడారు. రైతుల ఆందోళనలో న్యాయం ఉందన్నారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనే అంశంకంటే.. భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. అమరావతి రైతులు రాజధాని కావాలని అడగలేదని ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానికోసం భూములు కావాలని కోరగానే రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేశారన్నారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఎంపీ లావు చెప్పారు.

More Telugu News