Nadendla Bhaskara Rao: ముస్లింలకు నేను చేసినంత మేలు మరే సీఎం చేయలేదు: నాదెండ్ల భాస్కరరావు

  • పౌరసత్వ చట్టంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి
  • ఈ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదు
  • అల్లర్లు చేయడం దేశంలో కొందరికి అలవాటుగా మారింది

పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు. ఈ చట్టం గురించి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పౌరసత్వ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టమని ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ఈ చట్టంపై లోక్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉందని అన్నారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. అల్లర్లు చేయడం దేశంలో కొందరికి ఒక అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ముస్లింలకు తాను చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి చేయలేదని అన్నారు.

More Telugu News