అమరావతిలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేడు రాజధాని రైతుల వంటావార్పు
- నేటి కార్యాచరణను ప్రకటించిన జేఏసీ
- తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలో మహాధర్నా
- పాల్గొననున్న 29 గ్రామాల రైతులు
ఆందోళనల్లో భాగంగా నేటి ఉదయం 8:30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో శంకుస్థాపన చేసిన ప్రదేశంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. అదే సమయంలో తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పాల్గొంటారని జేఏసీ నేతలు పేర్కొన్నారు.