Andhra Pradesh: రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ కొనసాగింపు... రైతులపై కేసులు నమోదు

  • ఏపీకి మూడు రాజధానులంటూ ప్రచారం
  • రగిలిపోతున్న రాజధాని రైతులు
  • అమరావతిలో ఆందోళనలు

ఏపీకి మూడు రాజధానులు అంటూ జరుగుతున్న ప్రచారంతో అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. గత రెండ్రోజులుగా అమరావతిలో రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతుండడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతోపాటు 30 పోలీస్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు, ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News