క్రికెట్ కు విరామం ప్రకటించిన అపర కుబేరుడు!
- ఆటకు తాత్కాలికంగా దూరమైన ఆర్యమన్ బిర్లా
- ఆర్యమన్ ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం తనయుడు
- మానసిక సమస్యలతో తప్పుకుంటున్నట్టు వివరణ
మానసిక సమస్యలతోనే ఆట నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. అనేక సమస్యలను అధిగమించిన తాను వ్యక్తిగత సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నానని, అందుకే కొన్నాళ్లు ఆట నుంచి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నానని ఈ అపర కుబేరుడు వివరించాడు. ఆర్యమన్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తనయుడు. క్రికెట్ పై ప్రేమతో ఆటలో శిక్షణ పొందిన ఆర్యమన్ మధ్యప్రదేశ్ జట్టు తరఫున 9 దేశవాళీ మ్యాచ్ లు ఆడి 27.60 సగటుతో 414 పరుగులు చేశాడు. వాటిలో ఓ సెంచరీ కూడా ఉంది.
కాగా, క్రికెట్ తన జీవితంలో భాగమని, త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానంటూ ఈ యువ ఆటగాడు ట్వీట్ చేశాడు.