బోస్టన్ గ్రూపు నివేదిక కోసం ఎదురుచూస్తున్న ఏపీ సర్కారు!
- రాజధానిపై అధ్యయనం నిర్వహిస్తోన్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు
- జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ గ్రూపునకు కూడా బాధ్యతలు అప్పగింత
- ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన బోస్టన్ గ్రూపు
రాజధానిపై ఓ మధ్యంతర నివేదిక సమర్పించిన బీసీజీ ప్రస్తుతం పూర్తిస్థాయి నివేదికపై కసరత్తులు చేస్తోంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెలాఖర్లో జీఎన్ రావు కమిటీ నివేదికపై సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ లో చర్చించనున్నారు. అంతేకాదు, ఈ నివేదికను అఖిలపక్షం ముందుంచే సాధ్యాసాధ్యాలను కూడా సర్కారు పరిశీలిస్తోంది.