Jana Sena: 'రాజధాని' ఆందోళనలో పాల్గొన్న నాగబాబు.. బాడీవోర్న్ కెమెరాతో చిత్రీకరిస్తున్న పోలీసులు!
- రాజధాని గ్రామాల్లో అప్రకటిత బంద్ వాతావరణం
- ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు
- రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన నాగబాబు
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై వెలగపూడి రైతులు దీక్షకు దిగారు. రాజధాని గ్రామాల్లో అప్రకటిత బంద్ వాతావరణం కొనసాగుతోంది. గ్రామ కూడళ్ల వద్దకు వచ్చి రైతులతో కలిసి ప్రజలు ఆందోళనకు దిగారు.
మందడంలో సినీనటుడు నాగబాబు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. టోపీ పెట్టుకొని వచ్చి వారి మధ్య కూర్చొని ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు.
దీక్షల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. రాజధానిలో నిరసనలకు దిగిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. బాడీవోర్న్ కెమెరాతో రైతుల ఆందోళనలు చిత్రీకరిస్తున్నారు.
మందడంలో సినీనటుడు నాగబాబు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. టోపీ పెట్టుకొని వచ్చి వారి మధ్య కూర్చొని ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు.
దీక్షల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. రాజధానిలో నిరసనలకు దిగిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. బాడీవోర్న్ కెమెరాతో రైతుల ఆందోళనలు చిత్రీకరిస్తున్నారు.