Sri Simha: సెన్సార్ పూర్తిచేసుకున్న 'మత్తు వదలరా'

  • హీరోగా కీరవాణి తనయుడు 
  • దర్శకుడిగా రితేశ్ పరిచయం 
  • ఈ నెల 25వ తేదీన విడుదల 

తెలుగు తెరకి మరో కొత్త హీరో పరిచయమవుతున్నాడు .. ఆ హీరోనే కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా. 'మత్తు వదలరా' చిత్రం ద్వారా ఈ హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ .. క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా, రితేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి, కీరవాణి పెద్ద తనయుడు కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొత్త టీమ్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News