Uttar Pradesh: చందానగర్ లో అపార్ట్ మెంట్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

  • కుమారుడి పెంపకంపై మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఘటన
  • 2017లోనే వివాహం చేసుకున్న మృతురాలు ప్రియాంక
  • చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్ మెంట్ లో ఘటన 

యూపీకి చెందిన ఓ వివాహిత తాము నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో చోటుచేసుకుంది. మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్ ఈ మేరకు వివరాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రియాంక శ్రీవత్స(30) 2017లో గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్న తన రాష్ట్రానికి చెందిన అనుబో చెత్రియాను పెళ్లి చేసుకున్నారని చెప్పారు.

 వీరిద్దరికీ 10 నెలల బాబు కూడా ఉన్నాడని.. గత మూడు నెలలుగా ఈ కుటుంబం చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోందన్నారు. కొంత కాలంగా ప్రియాంక తన కుమారుడి పొషణ విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె బంధువులు తెలిపారని ఏసీపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే.. ఆమె తన అపార్ట్ మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.

More Telugu News