Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి మేము కొత్తగా చేసే సూచన ఇది: కన్నా లక్ష్మీనారాయణ

  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మా మేనిఫెస్టోలో ఉంది
  • హైకోర్టు బెంచ్ అమరావతిలో ఉంటే బాగుంటుంది
  • విధివిధానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి

ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానుల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ విషయమై తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, జగన్ తన ఆలోచనా విధానం గురించి చెప్పారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, సీడ్ క్యాపిటల్ అమరావతిలో ఉండాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందని, ఆ రకంగా జరిగితే సమర్థిస్తామని చెప్పారు. విధివిధానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. హైకోర్టు బెంచ్ అమరావతిలో ఉంటే బాగుంటుందని, ఏపీ ప్రభుత్వానికి తాము కొత్తగా చేసే సూచన ఇదని అన్నారు.

More Telugu News