Dhanush: విడుదల తేదీని ఖరారు చేసుకున్న 'తూటా'

  • రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా 'ఎన్నై నొక్కి పాయుమ్ తోటా'
  • 'తూటా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు
  • ఈ నెల 27వ తేదీన విడుదల

కథలో కొత్తదనం .. పాత్రల్లో వైవిధ్యం ఉండేలా చూసుకునే తమిళ హీరోల్లో ధనుశ్ ఒకరు. విభిన్నమైన కథాకథనాలతో ఆయన నుంచి ఇటీవల వచ్చిన చిత్రమే 'ఎన్నై నొక్కి పాయుమ్ తోటా'. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ నటించింది. క్రితం నెల 29వ తేదీన తమిళంలో విడుదలైన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

అలాంటి ఈ సినిమాను 'తూటా' టైటిల్ తో అదే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలైన తాతా రెడ్డి .. సత్యనారాయణ రెడ్డి భావించారుగానీ కుదరలేదు. ఈ నెల 27వ తేదీన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ను విడుదల చేయాలని వాళ్లు నిర్ణయించారు. ఆ రోజున పోటీ లేకపోవడంతో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందనే అభిప్రాయంతో వాళ్లు వున్నారు.

More Telugu News