student: సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి వెళ్లి అదృశ్యమైన యువతి!

  • మాసబ్‌ట్యాంకు జేఎన్‌టీయూలో డిగ్రీ పూర్తిచేసిన యువతి
  • జీవితంలో స్థిరపడిన తర్వాత కలుస్తానంటూ మెసేజ్
  • గాలిస్తున్న పోలీసులు

సర్టిఫికెట్లు తెచ్చుకుంటానంటూ కాలేజీకి వెళ్లిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చప్పల్ బజార్‌కు చెందిన కీర్తన (22) మాసబ్‌ట్యాంక్‌ జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని బుధవారం కళాశాలకు వెళ్లిన కీర్తన సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి సతీశ్ యాదవ్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీర్తన కోసం గాలిస్తున్నారు. కాగా, తాను జీవితంలో స్థిరపడిన తర్వాత మళ్లీ కలుస్తానంటూ కీర్తన తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు మెసేజ్ పంపినట్టు పోలీసులు తెలిపారు.  

More Telugu News