Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • మహేశ్ తో మరోసారి శ్రుతి హాసన్ 
  • పింక్ రీమేక్ లో నివేద థామస్ 
  • 'అసుర' రీమేక్ లో అభిరాం లేడట!  

  * గతంలో 'శ్రీమంతుడు' చిత్రంలో కలసి నటించిన మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంట మరోసారి జోడీ కట్టనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించే చిత్రంలో  కథానాయికగా శ్రుతి హాసన్ నటించనున్నట్టు తెలుస్తోంది. 
*  హిందీలో హిట్టయిన 'పింక్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్న సంగతి విదితమే. వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఓ కథానాయికగా నివేద థామస్ నటించనున్నట్టు తాజా సమాచారం. 
*  'అసుర' రీమేక్ లో తమ చిన్నబ్బాయి అభిరాం నటించనున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఖండించారు. ఈ వార్తలలో నిజం లేదని, అభిరాంను సోలో హీరోగా పరిచయం చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం అభిరాం ముంబైలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.  

More Telugu News