Akbaruddin Owaisi: నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ

  • 2012లో నిర్మల్ లో బహిరంగ సభలో మాట్లాడిన అక్బరుద్దీన్ 
  • వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు
  • విచారణకు హాజరైన ఒవైసీ

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. 2012లో నిర్మల్ లో తమ పార్టీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ  చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిర్మల్ కోర్టులో కొనసాగుతోంది.

ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రసంగించారని ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన విచారణకు హాజరవుతున్నారు. నిర్మల్ లోని కోర్టుకు పోలీసుల భద్రత మధ్య వచ్చిన ఆయన విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లారు.

More Telugu News