Hyderabad Business school: మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం

  • హైదరాబాద్ లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ నుంచి కవితకు ఆహ్వానం
  • 2020 జనవరి 9,10 తేదీల్లో జరగనున్న  సదస్సు
  • ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’పై ప్రసంగించనున్న కవిత

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరుతూ హైదరాబాద్ లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ ఆమెకు ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం మేరకు 2020 జనవరి 9,10 తేదీల్లో ‘ఇండియన్ డెమొక్రసీ ఎట్ వర్క్’ సదస్సులో ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ అనే అంశంపై ఆమె ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు   ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ ఎన్నికల అధికారి అశోక్ లావస, జస్టిస్ చలమేశ్వర్ హాజరుకానున్నారు.

More Telugu News