తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

  • 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • దర్శనానికి 8 గంటలకు పైగా సమయం
  • నిన్న హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు
వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో, ఈ ఉదయం స్వామి దర్శనం కోసం దాదాపు 35 వేల మందికి పైగా భక్తులు కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్టుమెంట్లు సర్వదర్శనం నిమిత్తం వచ్చిన భక్తులతో నిండిపోయివుంది.

వీరికి స్వామి దర్శనానికి కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ లను కలిగివున్న వారికి 3 గంటల్లో స్వామి దర్శనం పూర్తవుతుందని తెలిపారు. శనివారం నాడు స్వామివారిని 84,042 మంది భక్తులు దర్శించుకున్నారని, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్ల రూపాయలని వెల్లడించారు.

Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News