Chittoor District: అర్ధరాత్రి ప్రేయసి కోసం అమ్మాయిల హాస్టల్ లోకి ప్రియుడు.. భయంతో కేకలు వేసిన అమ్మాయిలు

  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
  • దమ్ముంటే అర్ధరాత్రి రావాలని అమ్మాయి సవాల్
  • అరెస్టు చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ యువకుడు తన ప్రేయసి కోసం అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర అమ్మాయిలు భయంతో కేకలు వేశారు. దమ్ముంటే అర్ధరాత్రి సమయంలో తానుంటోన్న హాస్టల్‌కి రావాలని తన ప్రేయసి రెచ్చగొట్టడంతోనే ఆ యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.

హాస్టల్ గోడలు ఎక్కి అందులోకి ప్రవేశించి,  ప్రేయసికి ఫోన్‌ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని ఇతర అమ్మాయిలు, వాచ్‌ ఉమెన్‌ గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల వాహనం వెంటనే అక్కడకు చేరుకోవడాన్ని గుర్తించిన ఆ యువకుడు గోడల పైపుల నుంచి జారుతూ కిందకు దూకాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి పేరు భాను ప్రసాద్‌ అని తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. 

  • Loading...

More Telugu News