Allu Arjun: భారీ రేటుకు 'అల వైకుంఠపురములో' డిజిటల్ రైట్స్

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అల వైకుంఠపురములో'
  • కీలకమైన పాత్రలో 'టబు'
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు 

'అల వైకుంఠపురములో' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ - పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

'నెట్ ఫ్లిక్స్'వారు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన లావాదేవీలు ఆల్రెడీ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సినిమాలో 'టబు' కీలకమైన పాత్రను పోషించడం విశేషం. ఇప్పటికే పూజా హెగ్డే స్టార్ డమ్ తో పాటు ఆమె పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆమె డేట్స్ దొరకడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

More Telugu News