Nara Lokesh: నూతనంగా నిర్మితమైన టీడీపీ ఆఫీసులో నారా లోకేశ్, బ్రాహ్మణి పూజలు... ఫొటోలు ఇవిగో!

  • రేపు ప్రారంభోత్సవం జరుపుకోనున్న టీడీపీ ఆఫీసు
  • కార్యాలయంలో హోమం నిర్వహణ
  • కుటుంబంతో వచ్చిన లోకేశ్ 

రేపు ప్రారంభోత్సవం జరుపుకోనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించారు. ఆపై సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ పాల్గొన్నారు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద టీడీపీ కార్యాలయం భారీస్థాయిలో నిర్మితమైంది. డిసెంబరు 6న చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

More Telugu News