ICICI Bank: ఈ నెల 15 నుంచి వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. ఛార్జీల వడ్డింపుకి సిద్ధం!

  • రోజువారీ నగదు లావాదేవీలపై చార్జీల భారం  
  • నెలలో 4 విడతలు మాత్రమే ఉచితం.. ఆపై రూ.150 వడ్డన 
  • సొంత శాఖలో 2 లక్షల వరకూ ఉచిత లావాదేవీలు

ప్రయివేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు ఈనెల 15 నుంచి ఛార్జీల మోత మోగించడానికి సిద్ధమౌతోంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. నూతన నిర్ణయం వల్ల సేవింగ్ ఖాతాల నగదు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. రోజువారీ నగదు డిపాజిట్, విత్ డ్రా, ఇతర లావాదేవీలపై ఈ చార్జీల వర్తింపు ఉంటుందని, తాము విధించిన పరిమితికి మించి జరిపే లావాదేవీలపై అదనంగా రుసుము వసూలు చేయడం జరుగుతుందని బ్యాంకు పేర్కొంది.

నెలకు 4 సార్లు నగదు లావాదేవాలు ఉచితంగా చేసుకోవచ్చు, అంతకు మించితే 150 రూపాయలు వసూలు చేస్తారు. తమ ఖాతా ఉన్న బ్రాంచి నుంచి 2 లక్షల రూపాయల వరకూ ఉచితంగా లావాదేవీలు (డిపాజిట్ లేక విత్ డ్రా) చేసుకోవచ్చునని పేర్కొనడం ద్వారా ఖాతా దారులకు కొంత ఊరటను కలిగించింది. అలాగే రోజువారీ జరిపే లావాదేవీల్లో భాగంగా రూ.25 వేల వరకు ఉచిత పరిమితిని ప్రకటించింది. అంతకు మించితే వెయ్యి రూపాయలకు గాను రూ.5 లేదా కనీసం రూ.150  ఛార్జీ వడ్డన ఉంటుంది. థర్డ్ పార్టీ లావాదేవీల సవరణలో భాగంగా రూ.25 వేల ట్రాన్సాక్షన్ కు రూ.150 రూపాయలను రుసుముగా పేర్కొనడంతో పాటు, రూ.25 వేలకు మించిన థర్డ్ పార్టీ లావాదేవీలపై నిషేధం విధించినట్లు తన వెబ్ సైట్ లో పేర్కొంది.

More Telugu News