Fire Accident: కారులో మంటలు చెలరేగి మచిలీపట్నం మహిళ సజీవ దహనం

  • కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘటన
  • నాసిక్ నుంచి మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదం
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలు

కారులో మంటలు చెలరేగి మచిలీపట్నానికి చెందిన కల్యాణి అనే మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటనలో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాపారం నిమిత్తం మహారాష్ట్రలోని నాసిక్ లో కల్యాణి కుటుంబం స్థిరపడింది. తన కుటుంబ సభ్యులను చూసేందుకు నాసిక్ నుంచి మచిలీపట్నానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కర్ణాటకలోని బీదర్ జిల్లా, మనేక్కెల్లి నిర్నా క్రాస్ రోడ్డు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన కల్యాణి భర్త, పిల్లలు వెంటనే కారులోంచి బయటకు రాగలిగారు. అయితే, కల్యాణికి మంటలు అంటుకోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

More Telugu News