kurnool: కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరాను: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామంది
  • కేంద్ర నిధులు విడుదలైనా అభివృద్ధి నత్తనడకగా వుంది
  • అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే

కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరానని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ కర్నూలులో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని విమర్శించారు.

ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేస్తానంటోందని, రాయలసీమలో ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే కానీ, తమతో కలిసి ఆయన పోరాడతారా? అనేదే అసలు ప్రశ్న అని అన్నారు.


More Telugu News