Chittoor District: చిత్తూరు జిల్లాలో ఇంటర్ బాలిక కిడ్నాప్!

  • కలకడ మండలం కొత్తపల్లిలో ఘటన
  • కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా కిడ్నాప్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన  బాలిక బంధువులు

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అనుప్రియ అనే బాలిక, కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో సతీశ్ అనే యువకుడు ఆమెను తన కారులో వెంబడించి కిడ్నాప్ కు పాల్పడ్డాడు. ఈ ఘటన నేపథ్యంలో కలకడ పోలీస్ స్టేషన్ లో బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పీలేరు-కడప రోడ్ లోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, గతంలోనూ అనుప్రియను కిడ్నాప్ చేసేందుకు సతీశ్ యత్నించినట్టు బాలిక బంధువుల ద్వారా తెలుస్తోంది.

More Telugu News