Vijay Devarakonda: కథా రచయితగా కనిపించనున్న విజయ్ దేవరకొండ

  • విభిన్నమైన ప్రేమకథగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  •  ఫిబ్రవరి 14వ తేదీన విడుదల  

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేస్తున్నాడు. రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా కనిపించనున్నారు. ఈ వారమంతా జరిగే చిత్రీకరణతో షూటింగు పార్టు పూర్తికానుంది. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో ఆయన కథా రచయితగా కనిపిస్తాడట. ఆయన రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయట. ఇలా ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందని అంటున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News