IPL: ఐపీఎల్ 2020 వేలం... ఈ విదేశీ స్టార్ ప్లేయర్స్ కావాలంటే రూ. 2 కోట్లు పెట్టాల్సిందే!

  • 19న కోల్ కతాలో జరగనున్న వేలం
  • 971 మందిలో 73 మందికే చాన్స్
  • రూ. 2 కోట్ల క్లబ్ లో పలువురు ఆటగాళ్లు

మరో రెండు వారాల్లో... అంటే 19న కోల్‌ కతాలో 2020 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన ఆటగాళ్ల వేలం మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా, వారిలో నుంచి 73 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఇక కనీస బేస్ ధర రూ. 2 కోట్లుగా ఉన్న విదేశీ ఆటగాళ్లలో పాట్ కమిన్స్, క్రిస్ లిన్, హేజల్‌ వుడ్, మిచెల్ మార్ష్, డేల్ స్టెయిన్, గ్లెన్ మాక్స్‌ వెల్, ఏంజెలో మాథ్యూస్ తదితరులు ఉన్నారు. అంటే వీరిని కొనాలని భావించే ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాల్సివుంటుంది. ఇక రూ. 1.50 కోట్ల విలువైన క్లబ్ లో జేసన్ రాయ్, షాన్ మార్ష్, కేన్ రిచర్డ్ సన్, ఇయాన్ మోర్గాన్, క్రిస్ వోక్స్, డేవిడ్ లిల్లీ, కెల్లీ అబ్బాట్, క్రిస్ మోరిస్ తదితర విదేశీ ఆటగాళ్లున్నారు.

More Telugu News