మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వుంటే వైసీపీ వుండేదా?: చంద్రబాబునాయుడు
- టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్నో దాడులు చేశారు
- 690 కేసులు బనాయించారు
- కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు
సీఎం జగన్ పాలనపైన కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. ఇన్నేళ్లలో ఒక విచిత్రమైన నాయకుడిని చూస్తున్నామని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏం పురోగతి సాధించారు? అని ప్రశ్నించారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని మండిపడ్డారు. ఇసుక ఇప్పుడైనా దొరుకుతోందా? అని ప్రశ్నించారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ.4 వేలు, లారీ ఇసుక రూ.10 వేలు ఉందని విమర్శించారు. కర్నూలు ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.