Disa: దిశ కేసులో మరో నిందితుడు ఉన్నాడని సోషల్ మీడియాలో పోస్ట్... పరుగులు పెట్టిన పోలీసులు!

  • చిన్నపొర్లలో మరో నిందితుడంటూ పోస్ట్
  • వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు
  • ఐదో నిందితుడు లేడని స్పష్టీకరణ

దిశ హత్యాచారం కేసులో ఐదో నిందితుడు ఉట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో ఉన్నాడంటూ, వాట్స్ యాప్ గ్రూపుల్లో ఓ పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ కేసులో గుడిగండ్ల, జుక్లేర్ గ్రామాలకు చెందిన మహ్మద్ పాషా, నవీన్ కుమార్, చెన్నకేశవులు, శివలను నిందితులుగా గుర్తించిన పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరిచి, కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిన్నపొర్లలో మరో యువకుడు ఉన్నాడని, అతను దిశను రేప్ చేసి చంపిన ఐదో నిందితుడని ఓ వదంతి వ్యాపించింది. ఇవి పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లిన ఎస్ఐ బృందం, గ్రామస్తుల వద్ద వివరాలు అడిగి తెలుసుకుంది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న గుడిగండ్ల నవీన్ కుమార్ కు చిన్నపొర్లలో బంధువులు ఉన్నారని, కొంతకాలం ఇక్కడే చదువుకున్నాడని తేల్చారు. అంతేతప్ప ఐదో నిందితుడు లేడని స్పష్టం చేశారు.

More Telugu News