Guntur District: గుంటూరులో కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడ్డ కేసులో నిందితుల అరెస్టు

  • ధరణికోటలో ఓ వ్యక్తిని బెదిరించిన కేసు పురోగతి
  • పంట భూమిని తన పేరిట రాయించుకున్న నిందితుడు
  • బాధితులను దారుణంగా హింసించారు

గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని ధరణికోటలో రమేశ్ అనే వ్యక్తిని వెంకటేశ్వరరావు చౌదరి అపహరించి, ఎంతో విలువైన భూమిని తన పేరిట రాయించుకున్న సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై బాధితుడు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను గుర్తించగా, తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ, కిడ్నాప్ నకు గురైన వారిని నిందితులు దారుణంగా హింసించారని, ఈ నిందితుల్లో బాచి అనే కానిస్టేబుల్ కూడా వున్నాడని చెప్పారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నాప్ చేశారని, ఈ కేసుకు సంబంధించి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సైతం నిందితులు బెదిరించారని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని భయపెట్టారని చెప్పారు.

More Telugu News