Uttarakhand: ఆధ్యాత్మిక క్షేత్రం కేదారీనాథ్ ను కప్పేసిన మంచు దుప్పటి

  • శీతాకాలం కావడంతో భారీగా పేరుకుపోయిన మంచు
  • ఇప్పటికే మూతపడిన ఆలయం
  • పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నా ఎముకలు కొరికే చలితో భక్తులకు ఇక్కట్లు

ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం కేదారినాథ్ ను మంచుదుప్పటి కప్పేసింది. శీతాకాలం కావడంతో ఆలయం పరిసరాలన్నీ మంచుతో నిండిపోయాయి. ఈ దృశ్యం ఎంతో మనోల్లాసాన్ని కలిగించేదిగా ఉన్నప్పటికీ ఎముకలు కొరికే చలి కావడంతో కనీసం సమీపంలోకి కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. శీతాకాలంలో ఎప్పుడూ ఇదే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకునే చార్ ధామ్ గా పిలిచే బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను చాలా రోజుల క్రితమే మూసివేశారు.

Uttarakhand
rudraprayaga district
snowfall

More Telugu News