Virat Kohli: 'అబద్ధాలు నిజమయ్యేలా ఉన్నాయి... అందుకే మాట్లాడుతున్నా': 'అనుష్క - ఓ సెలక్టర్' పుకార్లపై విరాట్ కోహ్లీ!

  • ఓ సెలక్టర్ టీ ఇచ్చాడని ఫరూఖ్ ఇంజనీర్ వ్యాఖ్యలు
  • సెలబ్రిటీ కావడంతో అనుష్క ప్రతి ఒక్కరికీ టార్గెట్
  • 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో కోహ్లీ

తన భార్య అనుష్క శర్మ సెలబ్రిటీ కావడంతో, ప్రతి ఒక్కరికీ సులువైన టార్గెట్ గా మారిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ ఆడుతున్న వేళ, శ్రీలంకతో మ్యాచ్ ఆడుతుంటే, సెలక్టర్ల బాక్స్ లో అనుష్క కూర్చుందని, ఓ సెలక్టర్ టీ ఇచ్చాడని మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఫరూఖ్ ఇంజనీర్ వ్యాఖ్యానించగా, అది వైరల్ అయింది. ఆ సెలక్టర్ ఎవరన్న కొత్త చర్చ నెట్టింట మొదలైంది.

దీనిపై 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడాడు. ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ, శ్రీలంకతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన తన భార్య ఆమె సెలక్టర్ల బాక్స్‌ లో కూర్చోలేదని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్యామిలీ బాక్స్‌ లో కూర్చుందని అన్నాడు. ఆమె పక్కన ఏ సెలక్టర్ లేడని చెప్పాడు. అనుష్క పేరును వివాదాల్లోకి లాగి కొందరు లబ్దిని పొందుతున్నారని ఆరోపించాడు.

  • Loading...

More Telugu News