Rangarajan: అప్పుడు ఎన్ కౌంటర్ చేసి, ఇప్పుడు చట్టం గురించి చెబుతున్నారా?: సజ్జన్నార్ ను ప్రశ్నించిన రంగరాజన్

  • వరంగల్ లో ఎన్ కౌంటర్ చేయించారని వార్తలు
  • సజ్జన్నార్ గురించి విని ఆనందించానన్న రంగరాజన్
  • ఇప్పుడేమో చట్టం గురించి చెబుతున్నారని విస్మయం

కొన్నేళ్ల క్రితం వరంగల్ సమీపంలో ఓ యువతిపై యాసిడ్ పోసిన నిందితులను నాడు ఎస్పీగా ఉన్న సజ్జన్నార్ ఎన్ కౌంటర్ చేసినట్టు వచ్చిన వార్తలను విని తాను ఎంతో సంతోషించానని, అప్పట్లో పోలీసులను అభినందించానని, అదే సజ్జన్నార్ ఇప్పుడు ప్రియాంక విషయంలో చట్టాల గురించి మాట్లాడుతుండటాన్ని చూసి ఆశ్చర్య పోతున్నానని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకులు రంగరాజన్ వ్యాఖ్యానించారు.

సజ్జన్నార్ మీడియాతో మాట్లాడుతూ, కామన్ లా సిస్టమ్ ఉందనడం, చట్టం తన పని తాను చేసుకుని వెళుతుందని అనడం విని విస్తుపోయానని ఆయన అన్నారు. ప్రియాంక విషయంలో నిందితుల తరఫున వాదించరాదని బార్ కౌన్సిల్ నిర్ణయించుకున్నప్పటికీ, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయని గుర్తు చేసిన రంగరాజన్, బాధితులకు తక్షణమే న్యాయం జరుగుతుందని భావించడం అత్యాశే అవుతుందని అన్నారు.

More Telugu News