Botsa Satyanarayana: సముద్ర తీరానికి నష్టం జరగకుండా విశాఖలో మెట్రో రైల్ విస్తరణ: బొత్స

  • మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించిన మంత్రుల బృందం
  • అధికారులతో బొత్స, అవంతి సమీక్ష
  • త్వరలోనే టెండర్లు

విశాఖలో మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటు, విస్తరణపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. అనంతరం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, విశాఖ సముద్ర తీరానికి ఎలాంటి నష్టం జరగకుండా మెట్రో రైలు ప్రాజక్టు విస్తరణ ఉంటుందని తెలిపారు. దశల వారీగా జరిగే ఈ విస్తరణ కార్యక్రమంలో తొలి విడతలో 47 కిమీ మేర మెట్రో నిర్మాణం జరుపుతామని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ ఉంటుందని, మెట్రో ప్రాజెక్టు పనుల్లో పీపీపీ విధానం అమలు చేస్తామని చెప్పారు.

More Telugu News