Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • అనిల్ రావిపూడి నుంచి 'సరిలేరు నీకెవ్వరు'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  •  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) ఫస్టు సింగిల్ ను విడుదల  చేయనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన బాణీలు కావడంతో, ఫస్టు సింగిల్ పట్ల అంతా ఆసక్తితో వున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇంతవరకూ పూర్తి వినోదభరితమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ .. హిట్లు కొట్టేస్తూ వచ్చాడు. అదే తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని ఆయన చెప్పడంతో, మహేశ్ బాబు ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ చేరిపోయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.

More Telugu News