Disha: మా కొడుకు చాలా మంచోడు: ప్రియాంక హత్యకేసు ప్రధాన నిందితుడి తల్లిదండ్రులు

  • ఇలాంటి పనులు మావాడు ఎప్పుడూ చేయలేదు
  • పెట్రోల్ బంకులో పని చేస్తున్నప్పుడు కూడా ఎవరి జోలికీ వెళ్లలేదు
  • గుడిగండ్లకు చెందిన ముగ్గురు మావాడి వద్దకు వచ్చేవారు

డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన దుర్మార్గులను ఉరి తీయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, తమ కుమారుడు చాలా మంచి వాడని ఈ కేసులో ప్రధాన ముద్దాయి మహ్మద్ ఆరీఫ్ తల్లిదండ్రులు పింజారి హుస్సేన్, మౌలాలీబీ చెబుతున్నారు. ఇలాంటి పనులు మావాడు ఎప్పుడూ చేయలేదని వారు తెలిపారు. గుడిగండ్లకు చెందిన ముగ్గురు తమ కుమారుడి వద్దకు తరచూ వచ్చేవారని చెప్పారు. మావాడు తన పని తాను చేసుకుంటూ ఇంటిపట్టునే ఉండేవాడని తెలిపారు. పెట్రోలు బంకులో పని చేస్తున్నప్పుడు కూడా ఎవరి జోలికీ వెళ్లలేదని చెప్పారు. మరోవైపు, కాసేపట్లో నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News