Shamshabad: శంషాబాద్ లో మరో దారుణం.. ఓ మహిళను హత్య చేసి తగులబెట్టిన దుండగులు!

  • సిద్దులగుట్టకు సమీపంలో ఘటన
  • అయ్యప్ప ఆలయం పక్కనే వున్న స్థలంలో హత్య
  • మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలింపు

డాక్టరు ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య ఘటన మరవకముందే శంషాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి తగులబెట్టారు. సిద్దులగుట్టకు సమీపంలోని ఓ ప్రధాన రోడ్డుకు పక్కనే అయ్యప్పస్వామి గుడి ఉంది. ఆ గుడి పక్కనే వున్న స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి తగులబెట్టారు. పూజల నిమిత్తం గుడికి వచ్చిన అయ్యప్ప దీక్షాపరులు ఈ సంఘటనను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఈ ఘటన జరిగి వుండవచ్చన్న అనుమానాలు తలెత్తాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

More Telugu News